sexual assult: ఆర్మీ జవాన్ల కీచక పర్వం.. బధిర మహిళను బ్లాక్ మెయిల్ చేస్తూ నాలుగేళ్లుగా అత్యాచారం!

  • మహారాష్ట్రలోని ఖడ్కీ సైనిక ఆసుపత్రిలో ఘటన
  • ఎన్జీవో సంస్థ చొరవతో బయటకొచ్చిన వ్యవహారం
  • కేసు నమోదుచేసిన పోలీసులు

దేశాన్ని, ప్రజల మానప్రాణాలను రక్షిస్తామని ప్రమాణం చేసిన జవాన్లు దాన్ని మర్చిపోయారు. జంతువుల్లా మారిపోయి ఓ బధిర మహిళపై తమ మృగవాంఛను తీర్చుకున్నారు. అక్కడితో ఆగకుండా ఈ దారుణాన్ని ఫోన్ లో వీడియో తీసి బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరికి బాధితురాలు ఓ ఎన్జీవో సంస్థ సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఖడ్కీ  మిలటరీ ఆసుపత్రి ఆవరణలో బాధితురాలు ఉంటోంది. ఈ నేపథ్యంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న నలుగురు ఆర్మీ జవాన్లు ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని ఫోన్ లో వీడియో తీశారు. అనంతరం ఈ వీడియోను బయటపెడతామని బెదిరిస్తూ గత నాలుగేళ్లుగా బాధితురాలిపై ఈ అకృత్యాన్ని కొనసాగిస్తున్నారు. చివరికి ఓ ఎన్జీవో సాయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా ఈ విషయమై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ కు ఎన్జీవో సంస్థ సాయంతో లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో నలుగురు ఆర్మీ జవాన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News