రాజ్నాథ్తో భేటి అయిన టీడీపీ నేతలు.. వీధినపడిన కుటుంబాలను ఆదుకోవాలని వినతి
- ‘తిత్లీ’ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని లేఖ
- తుపాను కారణంగా రూ.3435.29 కోట్ల నష్టం
- తక్షణ సాయం కింద రూ.1200 కోట్లు ఇవ్వాలని వినతి
‘తిత్లీ’ తుపాను కారణంగా రూ.3435.29 కోట్ల నష్టం వాటిల్లిందని... తక్షణ సాయం కింద రూ.1200 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు లేఖలో కోరారు. 36 లక్షల హెక్టార్లకు పైగా పంట నష్టం వాటిల్లిందని.. రెండు లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయని చంద్రబాబు తెలిపారు. సాయం అందించే విషయంలో రాజ్నాథ్ సానుకూలంగా స్పందించినట్టు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమ మీడియాకు వెల్లడించారు.