kcr: మేం కట్టించిన ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు.. ‘కాంగ్రెస్’ కట్టించిన ఏడు ఇళ్లకు సమానం: సీఎం కేసీఆర్

  • ఇందిరమ్మ ఇళ్లలో కాంగ్రెస్ వేల కోట్ల అవినీతి చేసింది
  • 2 లక్షల 60 వేల డబుల్ బెడ్రూమ్ ల నిర్మాణమే లక్ష్యం
  • అగ్రవర్ణాల పేదలకూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం

కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇందిరమ్మ ఇళ్లు చిన్నవని, అవి సరిపోవనే ఉద్దేశంతోనే తమ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమాశం ముగిసింది. అనంతరం, మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారు.

తమ హయాంలో కడుతున్న ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు..  ఏడు ‘ఇందిరమ్మ’ ఇళ్లకు సమానమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కాంగ్రెస్ పార్టీ వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. రెండు లక్షల అరవై వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణమే తమ లక్ష్యమని, నాడు కాంగ్రెస్ పార్టీ కట్టించిన పద్దెనిమిది లక్షల ఇందిరమ్మ ఇళ్లతో ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సమానమని అన్నారు. సొంత స్థలం ఉన్నవారికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నామని, అగ్రవర్ణాల పేదలకూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని, రెడ్డి, వైశ్య కులాలాకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News