akhil: అఖిల్ నాల్గొవ సినిమా బోయపాటితోనే

  • 'మిస్టర్ మజ్ను'తో బిజీగా అఖిల్ 
  • తదుపరి మూవీగా యాక్షన్ ఎంటర్టైనర్
  • స్క్రిప్ట్ రెడీ చేస్తోన్న బోయపాటి  

ప్రస్తుతం అఖిల్ తన మూడవ సినిమాను వెంకీ అట్లూరితో చేస్తున్నాడు. 'మిస్టర్ మజ్ను' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. కథ రీత్యా ఈ సినిమా విదేశాల్లో ఎక్కువగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా తరువాత అఖిల్ ఏ దర్శకుడితో చేయనున్నాడనే ప్రశ్నకి సమాధానంగా బోయపాటి పేరు వినిపిస్తోంది.

బోయపాటి తన దర్శకత్వంలో చరణ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన బాలకృష్ణతో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధంగా ఉండటంతో, రెండు మూడు నెలల్లోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేయగలననే నమ్మకంతో వున్నాడట. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే ఆయన అఖిల్ తో చేయనున్నాడనీ, నాగార్జున కోరిక మేరకు బోయపాటి కథను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. 

More Telugu News