YSRCP: ‘తిత్లీ’ బాధితులకు వైసీపీ సాయంపై టీడీపీ ఎంపీ ప్రశంసలు

  • రూ.కోటి విరాళంపై రామ్మోహన్ నాయుడు స్పందన
  • వైసీపీకి హృదయపూర్వక శుభాకాంక్షలు
  • రాజకీయాలకు అతీతంగా బాధితులను ఆదుకోవాలి  

‘తిత్లీ’ తుపాన్ తో దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లా వాసులను ఆదుకునేందుకు పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు తమ వంతు సాయం ఇప్పటికే ప్రకటించారు. ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించింది. ఈ ప్రకటనపై శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ విరాళం ప్రకటించిన వైసీపీకి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, రాజకీయాలకు అతీతంగా తుపాన్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని రామ్మోహన్ నాయుడు ఓ పోస్ట్ లో కోరారు. 

More Telugu News