TRS: టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం

  • తెలంగాణ భవన్ లో ప్రారంభం కానున్న సమావేశం
  • కొన్ని ముఖ్యమైన హామీలను వెల్లడించనున్న కేసీఆర్?
  • మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేకే సహా హాజరుకానున్న సభ్యులు

తెలంగాణ భవన్ లో కొద్ది సేపట్లో  టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కే కేశవరావు (కేకే) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇప్పటి వరకు వచ్చిన విజ్ఞప్తులు, సూచనలు, సలహాలపై ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్టు సమాచారం. కాగా, కేశవరావు సహా పదిహేను మంది కమిటీ సభ్యులు మీటింగ్ కు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన హామీలను కేసీఆర్ వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. పింఛన్ల పెంపు, ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం, వర్గాల వారీగా కొత్తపథకాలు ప్రకటిస్తారని సమాచారం. 

More Telugu News