Revanth Reddy: రేవంత్ కు చంద్రబాబు రూ. 500 కోట్లు ఇచ్చారు: ఈసీకి తెలంగాణ అడ్వొకేట్ల ఫిర్యాదు

  • కాంగ్రెస్ తో పొత్తు కోసం ఈ డబ్బును ఇచ్చారు
  • ఈ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయనున్నారు
  • రేవంత్ పై నిఘా పెట్టండి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ కు తెలంగాణ అడ్వొకేట్లు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం రేవంత్ కు చంద్రబాబు రూ. 500 కోట్లు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేయబోతున్నారని... రేవంత్ వ్యవహారంపై నిఘా పెట్టాలని కోరారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని విన్నవించారు.

More Telugu News