Jana Sena: రాజమహేంద్రవరం వైపు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్... వేలాదిగా చేరుకుంటున్న వైనం!

  • నేడు జనసేన కవాతు
  • మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం
  • సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ

నేటి సాయంత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం (రాజమండ్రి) సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజ్ పై కవాతు జరుగనుండగా, దీనిలో పాల్గొనేందుకు పెద్దఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం చేరుకున్న జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్ తో హోటళ్లు, లాడ్జిలు నిండిపోయాయి.

నగరమంతా కవాతుకు సంబంధించిన హోర్డింగ్ లు, జనసేన పతాకాలే కనిపిస్తున్నాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు పిచుకలలంక నుంచి ప్రారంభమయ్యే కవాతు, ధవళేశ్వరం కాటన్ విగ్రహం వరకూ కొనసాగుతుంది. జనసేన కవాతుకు సీపీఎం, సీపీఐ పార్టీల నుంచి మద్దతు లభించింది. కవాతు అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసే బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.

More Telugu News