KCR: నాకు టికెట్ ఇచ్చే ముందు.. ఆ బ్రోకర్‌కే ఇవ్వొచ్చు కదా?: బాబూ మోహన్

  • తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా?
  • కేసీఆర్ పాలన ఆహా.. ఓహో అనుకున్నా
  • నీళ్లు ఇవ్వకుండానే ఓట్లు అడుగుతున్నారు

'నాకు టిక్కెట్ ఇచ్చేముందు ఇప్పుడు టిక్కెట్ ఇచ్చిన బ్రోకర్‌కే ఇవ్వొచ్చు కదా?' అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ నేత బాబూ మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ సమరభేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూ మోహన్.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ కోసమే ముందస్తుకు వెళ్లారని విమర్శించారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా? అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు అప్పులయ్యాయని బాబూ మోహన్ ఆరోపించారు. తెలంగాణ వచ్చిందని చాలా ఆనందపడ్డానని.. తెలంగాణ ప్రజలకు విలువ, గౌరవం వచ్చాయనుకున్నానని.. కేసీఆర్ పాలన ఆహో.. ఓహో అనుకున్నానన్నారు. కానీ నీళ్లు ఇవ్వకుండానే ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. ప్రస్తుత సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పొద్దున లేస్తే మంత్రి హరీశ్ ఇంటి గేట్ దగ్గరే ఉంటారని, ఇటువంటి వ్యక్తిని గెలిపించ వద్దని ప్రజలను బాబూమోహన్ కోరారు.

More Telugu News