uppal test: ఉప్పల్ టెస్ట్ లో భారత్ ఘన విజయం.. సిరీస్ టీమిండియా కైవసం

  • రెండో ఇన్నింగ్స్ లో 127 పరుగులకే విండీస్ ఆలౌట్
  • 72 పరుగుల విజయ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన భారత్
  • సిరీస్ ను 2-0తో భారత్ కైవసం

వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో వెస్టిండీస్ పై పది వికెట్ల తేడాతో గెలిచిన భారత జట్టు ఈ సిరీస్ ను చేజిక్కించుకుంది. రెండో టెస్టులోనూ మూడు రోజుల్లోనే ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో 127 పరుగులకే విండీస్ జట్టు ఆలౌట్ అయింది.

విండీస్ నిర్దేశించిన 72 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. రెండు టెస్టుల సిరీస్ ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. కాగా, తొలిసారి టెస్టు మ్యాచ్ లో టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ పది వికెట్లు పడగొట్టడం విశేషం. ఇదిలా ఉండగా, వెస్టిండీస్ జట్టుతో భారత్ ఐదు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్ లు ఆడనుంది.  

- వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 311/ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 127/ఆలౌట్

- భారత్ తొలి ఇన్నింగ్స్ 367/ ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 72/ 0

More Telugu News