amith shah: అమిత్ షా లెక్కలు చెబితే.. లెక్కల మాస్టర్లు సూసైడ్ చేసుకుంటారు: ఎంపీ కవిత

  • తెలంగాణకు రెండున్నర లక్షల కోట్లు ఇచ్చారట
  • తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ.900 కోట్లే
  • అమిత్ షా మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలు

టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కవిత మండిపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అమిత్ షా లెక్కలు చెబితే.. లెక్కల మాస్టర్లు సూసైడ్ చేసుకుంటారని విమర్శించారు. కేంద్రం ఈ నాలుగేళ్లలో తెలంగాణకు రెండున్నర లక్షల కోట్లు ఇచ్చారని అమిత్ చెప్పారని, ఇచ్చింది కేవలం రూ.900 కోట్లని స్పష్టం చేశారు.

అమిత్ షాకు ఎన్నిసార్లు చెబుతాం, ఆయన్ని ఏమన్నా అంటే, ఇక్కడి బీజేపీ వాళ్లు గుంజుకుంటారని అన్నారు. అమిత్ షా మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలనీ, ఇలానే అబద్ధాలు చెబితే.. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ఐదు స్థానాలు ఉన్నాయని, త్వరలో జరిగే ఎన్నికల్లో ఆ ఐదు స్థానాలను కూడా కోల్పోవడం ఖాయమని అన్నారు.

More Telugu News