Rajasthan: వేధిస్తున్న యువకుడిని పట్టుకుని.. చెప్పులతో కొట్టిన అక్కాచెల్లెళ్లు!

  • రాజస్థాన్ లోని బుసావర్ లో ఘటన
  • షాపింగ్ చేసేందుకు వచ్చిన ఇద్దరమ్మాయిలు
  • మందు కొట్టి వేధించిన పోకిరీ
  • స్థానికుల సాయంతో దేహశుద్ధి

ఇండియాలో ఉద్ధృతమైన 'మీటూ' ఉద్యమం స్ఫూర్తినిచ్చిందో లేక, తమలోని ధైర్యం బయటకు వచ్చిందోగానీ, ఇద్దరు అక్కాచెల్లెళ్లు, తమను వేధిస్తున్న మందుబాబును ఉతికేశారు. ఒకటి రెండు నిమిషాలు కాదు... ఏకంగా 20 నిమిషాల పాటు చెప్పులు తీసుకుని వాయించారు. ఈ ఘటన రాజస్థాన్‌ లోని భరత్‌ పూర్‌ సమీపంలోని బుసావర్‌ లో జరిగింది.

బుసావర్ బజార్‌కు ఇద్దరు అక్కాచెల్లెళ్లు షాపింగ్ నిమిత్తం ఓ దుకాణం వద్దకు రాగా, అప్పటికే అక్కడ మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు, వారిని చూసి అసభ్యపు కామెంట్లు చేయడం ప్రారంభించాడు. అతని మాటలని కాసేపు భరించిన వీరిద్దరూ, ఇక తాళలేక, తమ చెప్పులకు పనిచెప్పారు. వారికి స్థానికులు కూడా మద్దతుగా నిలవడంతో, 20 నిమిషాల పాటు సదరు మందుబాబు వారి చేతిలో చెప్పుదెబ్బలు తిన్నాడు. ఈ ఘటనలో యువకుని ముక్కునుంచి తీవ్రంగా రక్తస్రావమైంది. ఆపై అతన్ని వదిలేసిన బాధితురాళ్లు, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదూ నమోదు కాలేదని తెలుస్తోంది.

More Telugu News