Brothers: మునిగిపోతున్న తమ్ముడిని కాపాడబోయిన అన్న కూడా మునిగిపోయాడు!

  • ఉట్నూర్ మత్తడి ప్రాజెక్టులో విషాదం
  • ఫొటోలు తీసుకునేందుకు వెళ్లి నీటిలో పడ్డ తమ్ముడు
  • కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన అన్న

దసరా సెలవులను ఎంజాయ్ చేయాలన్న అన్నదమ్ముల ప్రయత్నం వారింట తీరని విషాదాన్ని మిగిల్చింది. ఉట్నూరు సమీపంలో మత్తడి ప్రాజెక్టు వద్దకు విహారానికి వెళ్లిన ఇద్దరు సోదరులు, నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్‌ కు చెందిన జాదవ్‌ ప్రహ్లద్‌ దంపతులకు అరుణ్‌(14), తరుణ్‌ (16) సంతానం.

దసరా సెలవులకు వారు ఉట్నూర్‌ లో ఉంటున్న పెద్దమ్మ కూతురు శిల్ప ఇంటికి వచ్చారు. వారి పిల్లలతో కలసి మత్తడిగూడ చెరువు వద్దకు పిక్‌ నిక్‌ నిమిత్తం వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వెళ్దామనుకునే సమయంలో నీటిలో సెల్ఫీలు దిగేందుకు వెళ్లారు. లోతు తెలియక పోవడం, ఈతరాక పోవడంతో అరుణ్‌ నీళ్లలో కాలుజారగా, అతన్ని కాపాడే నిమిత్తం తరుణ్ కూడా నీటిలో మునిగాడు. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు వదిలారు. వారి మిత్రుల కేకలతో స్థానికులు చేరుకుని, గజ ఈతగాళ్ల సాయంతో దాదాపు గంటసేపు గాలించి, ఇద్దరి మృతదేహాలనూ వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News