Nitya menon: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తొలిసారిగా నిత్యామీనన్ హిందీ చిత్రం 
  • డిసెంబర్ నుంచి రాజమౌళి మల్టీ స్టారర్ 
  • విశాఖలో రామ్ చరణ్ చిత్రం షూటింగ్  

*  బొద్దుగుమ్మ నిత్యా మీనన్ ప్రస్తుతం 'ప్రాణ' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దక్షిణాది నాలుగు భాషలలోను విడుదల చేయడంతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హిందీ వెర్షన్ ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా నిత్యామీనన్ పాల్గొంటుందట. హిందీలో ఇది ఆమెకు తొలి చిత్రం అవుతుంది.
*  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందే భారీ మల్టీ స్టారర్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని, ఆ లోగా రాజమౌళి నిర్వహించే వర్క్ షాప్ కి ఎన్టీఆర్, చరణ్ హాజరవుతారని సమాచారం.
*  బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగును విశాఖలో నిర్వహిస్తారు. ఇందుకోసం యూనిట్ విశాఖకు బయలుదేరి వెళ్లింది. ముందుగా సింహాచలం దేవాలయం పరిసరాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారట.

More Telugu News