Judge: పట్టపగలే నడిరోడ్డుపై జడ్జి భార్య, కుమారుడి హత్య

  • హర్యానాలోని గుర్‌గావ్‌లో హత్య
  • దుండుగుడి వివరాలేవీ తెలియరాలేదు
  • గాలిస్తున్న పోలీసులు

ఒక జడ్జి భార్య, కొడుకును పట్టపగలే నడిరోడ్డుపై అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన హర్యానాలోని గురుగావ్‌లో సంచలనం రేపుతోంది. హత్య చేసిన దుండగుడు ఎవరు? ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే వివరాలేవీ ఇంకా తెలియరాలేదు. గుర్‌గావ్‌లోని సెక్టార్ 49లోని ఆర్కడియా మార్కెట్ సమీపంలో శనివారం మధ్యాహ్నం ఈ హత్య జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే జడ్జి, భార్య, కుమారుడు మరణించారు. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News