Kamal Haasan: సీక్వెల్ దిశగా కమల్ 'క్షత్రియ పుత్రుడు'

  • సీక్వెల్ గా వచ్చిన 'విశ్వరూపం 2'
  • సెట్స్ పైకి వెళ్లనున్న 'భారతీయుడు 2'
  • 'దేవరమగన్' సీక్వెల్ కి సన్నాహాలు    

కమలహాసన్ కెరియర్లో కొన్ని సినిమాలు చెప్పుకోదగినవిగా నిలిచాయి. ఆ సినిమాలు భారీ విజయాలను నమోదు చేయడమే కాకుండా, ఆయన క్రేజ్ ను మరింతగా పెంచేశాయి. అలాంటి సినిమాలకు సీక్వెల్ చేయడానికి కమలహాసన్ ఆసక్తిని చూపుతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల 'విశ్వరూపం 2' సినిమాను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ప్రస్తుతం ఆయన 'భారతీయుడు' సినిమా సీక్వెల్లో చేయడానికి రెడీ అవుతున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమా సీక్వెల్ కి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన 'క్షత్రియపుత్రుడు' సీక్వెల్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారని సమాచారం. 'దేవరమగన్' పేరుతో తమిళంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది. 'భారతీయుడు 2' తరువాత ఈ సినిమా పట్టాలెక్కుతుందని కమల్ చెప్పారు. మొత్తానికి కమల్ మూడవ సీక్వెల్ కి కూడా రెడీ అవుతున్నారన్న మాట.    

More Telugu News