Telugudesam MP: స్టీల్ ప్లాంట్ డిమాండుతో.. కేంద్ర మంత్రితో భేటీ అయిన టీడీపీ ఎంపీలు

  • బీరేంద్ర సింగ్ ను కలిసిన టీడీపీ ఎంపీలు
  • కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వినతి
  • అంతకు ముందు సుజనా చౌదరి నివాసంలో భేటీ

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం టీడీపీ ఎంపీలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలో ఈ ఉదయం కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ ను వారు కలిశారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశానికి ముందు సుజనాచౌదరి నివాసంలో వీరంతా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రితో భేటీ సందర్భంగా ఆయన ముందు ఐదు డిమాండ్లు ఉంచినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News