Visakhapatnam District: వైజాగ్ లో దారుణం.. పోలీస్ కానిస్టేబుల్ ను నడిరోడ్డుపై నరికి చంపిన గంజాయి స్మగ్లర్లు!

  • వేంపాడు టోల్ గేట్ వద్ద ఘటన
  • కారులో దూసుకొచ్చిన దుండగులు
  • కత్తులతో నరికి పరారీ

విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి నక్కపల్లి మండలం, వేంపాడు టోల్ గేట్ వద్ద ఆగిఉన్న ఓ వ్యక్తిని కారులో వచ్చిన 8 మంది దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అనంతరం అదే వాహనంలో ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని తమిళనాడుకు చెందిన నీలమగ అమరన్ గా గుర్తించారు. మృతుడు మధురైలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గంజాయి వ్యాపారులే ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నామన్నారు.

అయితే గంజాయి వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్నందున ఈ హత్య చేశారా? లేక ఈ దారుణం వెనుక మరేదైనా కారణం ఉందా? అన్న విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

More Telugu News