CM Ramesh: సీఎం రమేశ్ ఇల్లు, కార్యాలయాల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు!

  • దాడుల్లో పాల్గొంటున్న 100 మంది అధికారులు
  • రిత్విక్ కంపెనీలో హార్డ్ డిస్క్ లు స్వాధీనం
  • నిన్న మొదలైన దాడులు

తెలుగుదేశం నేత, పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్ నివాసం, కార్యాలయాల్లో రెండో రోజు ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్న అర్థరాత్రి వరకూ హైదరాబాద్ లోని రమేశ్ నివాసంతో పాటు రిత్విక్ కంపెనీలో సోదాలు కొనసాగాయి. తాజాగా ఈ రోజు ఉదయం అధికారులు మళ్లీ తనిఖీలను ప్రారంభించారు. దాదాపు 50 నుంచి 100 మంది ఐటీ అధికారులు ఉదయాన్నే హైదరాబాద్ లోని సీఎం రమేశ్ నివాసం, మిగిలిన కార్యాలయాలకు చేరుకుని సోదాలు మొదలుపెట్టారు. రిత్విక్‌ సంస్థ నుంచి ఇప్పటివరకూ అధికారులు 8 హార్డ్‌ డిస్క్‌లు, 18 పెన్‌ డ్రైవ్‌లు, 6 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి.

More Telugu News