nikhil: ముగింపు దశలో నిఖిల్ 'ముద్ర'

  • నిఖిల్ హీరోగా 'ముద్ర'
  • నాయికగా లావణ్య త్రిపాఠి
  • నవంబర్ 8న విడుదల   

నిఖిల్ తాజా చిత్రంగా 'ముద్ర' రూపొందుతోంది. టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగుతో పాటు డబ్బింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు.

లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, నవంబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నిఖిల్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడు. ఇక ఈ మధ్య రేస్ లో లావణ్య త్రిపాఠి కాస్త వెనుకబడిపోయింది. అందువలన ఆమె కూడా ఈ సినిమా హిట్ తనకి చాలా అవసరమని భావిస్తోంది. మరి వాళ్లు ఆశించిన ఫలితాన్ని ఈ సినిమా అందిస్తుందో లేదో చూడాలి.       

More Telugu News