prabhas: ప్రభాస్ కోసం 7 కోట్ల ఖర్చుతో భారీ సెట్!

  • ఇటలీలో ప్రభాస్ షూటింగ్ 
  • పరిశీలనలో 'జాన్' టైటిల్ 
  • నిర్మాతగా కృష్ణంరాజు

ఒక వైపున 'సాహో' సినిమా చేస్తూనే .. మరో వైపున 'జిల్' ఫేమ్ రాధాకృష్ణతో కలిసి ప్రభాస్ సెట్స్ పైకి వెళ్లాడు. ప్రస్తుతం ఈ ప్రేమకథా చిత్రం షూటింగు ఇటలీలో జరుగుతోంది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లోని కొన్ని రొమాంటిక్ సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారట.

అక్కడ షూటింగు జరుగుతుండగానే, హైదారాబాద్ లో తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయి. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. అందుకోసం 7 కోట్ల ఖర్చుతో ఇక్కడ భారీ సెట్ వేస్తున్నారట. కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ఈ సెట్లో జరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణంరాజు సొంతబ్యానర్ అయిన గోపీకృష్ణ మూవీస్ లో ఈ సినిమా నిర్మితమవుతోంది. యూవీ క్రియేషన్స్ వారు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా వున్నారు.   

More Telugu News