maoist encounter: ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి!: ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ

  • ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో ఘటన
  • అండ్రపల్లి వద్ద పోలీసులకు ఎదురుపడిన మావోయిస్టులు
  • మృతురాలిని రానాగా గుర్తింపు

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏఓబీ)ల్లో పోలీసుల వేట కొనసాగుతోంది. ఇటీవల విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. అనంతరం పలువురు నేతలకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు ఏఓబీని జల్లెడ పడుతున్నారు. పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ తెలిపారు. కూంబింగ్‌ సందర్భంగా అండ్రపల్లి వద్ద పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారని, ఈ సందర్భంగా ఎదురు కాల్పులు జరిగాయని ఎస్పీ వివరించారు. ఈ ఘటనలో రానా అనే మహిళ మృతి చెందినట్లు గుర్తించామన్నారు.

More Telugu News