Chandrababu: ఓటుకు నోటు కేసులో పాత్రధారి ఈరోజున కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు: ఎంపీ కవిత

  • ‘ఓటుకు నోటు’లో నాడు జీవన్ రెడ్డి వ్యాఖ్యల ప్రస్తావన
  • సూత్రధారి చంద్రబాబు, పాత్రధారి రేవంత్ అని అన్నారు
  • రాజకీయ అస్థిరత తెచ్చేందుకే టీడీపీతో కుమ్మక్కు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యల గురించి టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రస్తావించారు. జగిత్యాలలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ‘ఓటుకు నోటు కేసులో మీ అభిప్రాయం ఏంటి?’ అని జీవన్ రెడ్డిని నాడు విలేకరులు ప్రశ్నిస్తే.. ‘సూత్రధారేమో చంద్రబాబు నాయుడు గారు.. పాత్రధారేమో రేవంత్ రెడ్డి గారు’ అని చెప్పారని ప్రస్తావించారు.

ఓటుకు నోటు కేసులో పాత్రధారి ఈరోజున కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, సూత్రధారిని పక్కనపెట్టుకుని కూటమి కూడా కడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో రాజకీయ అస్థిరత తెచ్చేందుకు టీడీపీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కవుతోందని అనుకోవచ్చా? మీరు సర్టిఫికెట్ ఇచ్చినట్టేనా? అని ప్రశ్నించిన కవిత, ఈ విషయమై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందిగా జీవన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నానన్నారు. 

More Telugu News