vijay devarakonda: విజయ్ దేవరకొండ మూవీలో ఇద్దరు హీరోయిన్లు

  • క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 
  • కథానాయికలుగా రాశి ఖన్నా - ఐశ్వర్య రాజేశ్ 
  • త్వరలోనే సెట్స్ పైకి

విజయ్ దేవరకొండ నుంచి 'టాక్సీవాలా' సినిమా రావలసి ఉండగా, 'డియర్ కామ్రేడ్' సెట్స్ పై వుంది. ఈ రెండు సినిమాలు కంటెంట్ పరంగా విభిన్నమైనవే కావడంతో, అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. ఇక మరో సినిమా చేయడానికి కూడా విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో .. కె.ఎస్.రామారావు నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఆ పాత్రలకిగాను రాశి ఖన్నాను .. ఐశ్వర్య రాజేశ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. రాశి ఖన్నా ను గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇక ఐశ్వర్య రాజేశ్ కి తెలుగులో ఇదే మొదటి సినిమా. ఈ అమ్మాయి హాస్యనటి శ్రీలక్ష్మికి మేనకోడలు .. 'మల్లెమొగ్గలు' హీరో రాజేశ్ కి కూతురు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు.    

More Telugu News