susheela: అప్పట్లో ఓసారి 6 నెలల పాటు పాడలేకపోయాను: గాయని సుశీల

  • ఒకసారి నా వాయిస్ దెబ్బతింది 
  • అప్పటివరకూ నిర్మాతలు వెయిట్ చేశారు 
  • నన్ను తమ కుటుంబసభ్యురాలిగా చూసుకున్నారు 

తెలుగు సినిమా పాటకి తీయదనం నేర్పిన స్వరం సుశీల సొంతం. ప్రతి కథానాయికకి ఆమె స్వరం సరిగ్గా సరిపోవడం గురించి ఇప్పటికీ విశేషంగా చెప్పుకుంటారు. వరుస సినిమాలకి పాడవలసి రావడం వలన, ఆమె రెండు బిస్కట్లు తినేసి .. టీ తాగేసి మరో సినిమాకి పాడేవారట. అలా భోజనం చేయడానికి కూడా తీరికలేనంత కెరియర్ ను ఆమె చూశారు.

అలాంటి సుశీల తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నేనే పాడాలని నా కోసం ఎదురుచూసే నిర్మాతలు ఉండేవాళ్లు. ఒకసారి నా వాయిస్ దెబ్బతిని ఆరు నెలలపాటు పాటలు పాడలేకపోయాను. అప్పుడు ఓ తమిళ సినిమా నిర్మాత ఆరునెలల పాటు నా కోసం వెయిట్ చేసి .. తన సినిమాకి పాడించుకున్నారు. అప్పుడు అలా ఉండేవారు. అన్నపూర్ణ పిక్చర్స్ వారు .. ఎన్టీ రామారావు గారు తమ బ్యానర్లోని సినిమాలకి పాటలు నాతోనే పాడించేవారు. ఈ రెండు సంస్థలు వాళ్ల కుటుంబంలో ఒక సభ్యురాలిగా నన్ను చూసుకునేవి" అని ఆమె చెప్పుకొచ్చారు. 

More Telugu News