Anantapur District: అనంతపురం జిల్లాలో టెన్షన్ టెన్షన్.. వైసీపీ నేతను కొట్టిచంపిన ప్రత్యర్థులు!

  • ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కేశవరెడ్డి భార్య

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరుకు చెందిన వైసీపీ నేత కేశవరెడ్డిపై కొందరు దుండగులు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కేశవరెడ్డిని ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

 కాగా, ఈ దారుణానికి పాల్పడింది పరిటాల సునీత వర్గీయులేనని కేశవరెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల కారణంగానే పరిటాల వర్గీయులు కేశవరెడ్డిని పొట్టన పెట్టుకున్నారని మండిపడుతున్నారు. ఈ సందర్భంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేశవరెడ్డి భార్య పోలీసులను ఆశ్రయించింది. కేశవరెడ్డి హత్య నేపథ్యంలో ఆత్మకూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

More Telugu News