ananth: మా రాజబాబు పిల్లలు ఇప్పుడు కోటీశ్వరులు: చిట్టిబాబు

  • రాజబాబు పిల్లలు అమెరికాలో వుంటున్నారు 
  • వాళ్లకి సొంత సాఫ్ట్ వేర్ సంస్థలు వున్నాయి 
  • ఇండియాలో పాతిక కోట్ల ఆస్తిపాస్తులున్నాయి

రాజబాబుతో తమకి గల అనుబంధాన్ని గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో చిట్టిబాబు .. అనంత్ ప్రస్తావించారు. రాజబాబు కారణంగానే తాము నటన వైపుకు వచ్చామని చెప్పారు. ఈ సమయంలోనే రాజబాబు పిల్లల గురించి మాట్లాడారు . "మా రాజబాబు పిల్లలు ప్రస్తుతం అమెరికాలో వుంటున్నారు. ఇక్కడి నుంచి వాళ్లు అమెరికా వెళ్లేప్పుడు ఒకడు టెన్త్ క్లాస్ .. ఒకడు సెవెంత్ క్లాస్. వాళ్లు అక్కడ స్థిరపడిపోయి పాతికేళ్లకిపైగా అవుతోంది.

ఈ రోజున వాళ్లకి అక్కడ సొంత సాఫ్ట్ వేర్ సంస్థలు వున్నాయి. ఇండియాలో వాళ్లకి పాతిక కోట్ల ఆస్తి వుంది. ఏడాదికి ఒకసారి వస్తారు .. చూసుకుని వెళ్లిపోతారు. అయితే వాళ్లు అక్కడికి వెళ్లిన దగ్గర నుంచి మాతో టచ్ లో లేరు .. అలాగని చెప్పేసి మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎప్పుడూ నిండుగా వుండే మా వదినగారు .. మరోలా మాకు ఎదురుపడటం ఇష్టం లేకపోవడమే అందుకు కారణమని అనుకుంటున్నాము. ఏదేవైనా తండ్రిలేని ఆ పిల్లలను ఈ రోజున ఇంతటి వాళ్లను చేసిన ఆ మహాతల్లికి పాదాభివందనం చేస్తున్నాము" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News