india: వృద్ధిరేటులో చైనాను భారత్ దాటిపోతుంది: ఐఎంఎఫ్ నివేదిక

  • ఈ ఏడాది భారత్ 7.3 శాతం వృద్ధిరేటు సాధించొచ్చు  
  • 2019 లో వృద్ధిరేటు 7.4 శాతానికి పెరిగే అవకాశం
  •  వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ నివేదికలో వెల్లడి

ఈ ఏడాది భారత్ 7.3 శాతం వృద్ధిరేటు సాధించే అవకాశం ఉందని, 2019 లో వృద్ధిరేటు 7.4 శాతానికి పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. తాజాగా విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్ లో అమలవుతున్న ముఖ్యమైన సంస్కరణలు.. జీఎస్టీ, ద్రవ్యోల్బణం తగ్గింపు లక్ష్యంగా ప్రణాళిక, దివాలా స్మృతి చట్టం, విదేశీ పెట్టుబడుల సరళీకరణ తదితర అంశాలను ఈ నివేదికలో ప్రస్తావించింది.

తమ అంచనాలు నిజమైతే  ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా త్వరలోనే తిరిగి భారత్ నిలిచే అవకాశముందని, చైనాను ఈ ఏడాదిలో 0.7 శాతం తేడాతో భారత్ దాటిపోనుందని ఐఎంఎఫ్ పేర్కొంది. చైనాపై అమెరికా విధిస్తున్న సుంకాల ప్రభావమూ ఆ దేశ వృద్ధిరేటుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ నివేదికలో తెలిపింది. ఈ ఏడాది చైనా 6.6 శాతం వృద్ధిరేటు మాత్రమే సాధించే అవకాశం ఉందని, 2019లో అది 6.2 శాతానికి పడిపోయే అవకాశం ఉందని ఆ నివేదికలో తెలిపింది.

More Telugu News