chaitu: ఆకట్టుకుంటోన్న 'సవ్యసాచి' లిరికల్ సాంగ్

  • డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'సవ్యసాచి'
  • యూత్ మనసులను పట్టేసే పాట 
  • మరింత హ్యాండ్సమ్ గా చైతూ

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'సవ్యసాచి' రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

"చాటుగ చాటుగ దాచిన మాటలు .. రోజులు రోజులు వేచిన చూపులు .. గీతలు దాటుకుని ఏవైపెళ్లాయో.. " అంటూ ఈ పాట మొదలవుతోంది. ప్రేమలో పడిన నాయకా నాయికలు .. తమ మనసులోని భావాలకు అందమైన అక్షర రూపం ఇచ్చే క్రమంలో పుట్టినట్టుగా ఈ పాట కనిపిస్తోంది. గతంలో కంటే ఈ సినిమాలో చైతూ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇక నిధి అగర్వాల్ గ్లామర్ చూస్తుంటే .. పెద్ద హీరోల సరసన కూడా వరుస అవకాశాలను రాబట్టేయనున్నట్టు అనిపిస్తోంది.

More Telugu News