chittibabu: పిల్లలు ముచ్చట పడ్డారని.. శివాజీ గణేశన్ కారుని అన్నయ్య కొనేశాడు!: రాజబాబు సోదరుడు చిట్టిబాబు

  • అది శివాజీ గణేశన్ కారు 
  • అప్పట్లోనే అది లక్ష రూపాయలు 
  • ఆ కారు వెనకే శివాజీ గణేశన్ ఇంటికి వెళ్లాడు

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రాజబాబు సోదరులు మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "ఓ సాయంత్రం వేళ పిల్లలతో కలిసి రాజబాబు మెట్లపై కూర్చున్నాడు. అంతలో శివాజీ గణేశన్ గారి ఖరీదైన కారు ఆ ఇంటి ముందుగా వెళ్లింది. 'అలాంటి కారు ఎప్పుడు కొంటావు డాడీ?' అని పిల్లలు అడిగారు. ఆ కారు మీకు కావాలా? అని చెప్పేసి .. ఆ కారు వెనకే శివాజీ గణేశన్ ఇంటికి వెళ్లాడు రాజబాబు.

ఆ కారు తనకి కావాలని రాజబాబు అడిగితే .. మందేసి వచ్చి అడుగుతున్నాడేమోననుకుని శివాజీ గణేశన్ కారు తాళాలు ఇచ్చేశారు. కారు తీసుకొచ్చి పిల్లలను కూర్చోబెట్టుకుని రెండు రౌండ్లు వేసి షెడ్లో పెట్టాడు. మరుసటి రోజు శివాజీ గణేశన్ కి లక్షరూపాయలు పంపించడంతో ఆయన ఆశ్చర్యపోయారు. రాజబాబుని పిలిపించి 'ఎందుకయ్యా నీకంత కారు' అన్నారు. నా కోసం కాదు .. నా పిల్లల ముచ్చట తీర్చడం కోసం అని చెప్పాడు .. ఇప్పటికీ ఆ కారు అలాగే వుంది" అని చెప్పుకొచ్చారు.     

More Telugu News