Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'పడిపడి లేచే మనసు' అంటున్న సాయి పల్లవి 
  • లండన్ లో 'రోబో' సీక్వెల్ రీరికార్డింగ్
  • లేడీ డైరెక్టర్ తో సుధీర్ బాబు!
  • 'సైరా'లో జాయిన్ అయిన తమిళ హీరో    

*  శర్వానంద్, సాయిపల్లవి కలసి నటిస్తున్న 'పడిపడి లేచె మనసు' చిత్రం షూటింగ్ ముగింపు దశలో వుంది. ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుగుతోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ ను రేపు (అక్టోబర్ 10) రిలీజ్ చేస్తారు.
*  రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో సీక్వెల్ '2.ఓ' చిత్రం రీరికార్డింగ్ ప్రస్తుతం జరుగుతోంది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఈ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా లండన్ లో నిర్వహిస్తున్నాడు.
*  తాజాగా 'నన్ను దోచుకుందువటే' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో సుధీర్ బాబు త్వరలో ఓ లేడీ డైరెక్టర్ తో పనిచేయనున్నాడు. ఆమె చెప్పిన కథ నచ్చడంతో సుధీర్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఆ దర్శకురాలు ఎవరన్నది త్వరలో ప్రకటిస్తారు.
*  చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం షూటింగ్ జార్జియాలో భారీ ఎత్తున జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం షూటింగులో తమిళ హీరో విజయ్ సేతుపతి జాయిన్ అయ్యాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

More Telugu News