telangana: ఈనెల 12న నోటిఫికేషన్ విడుదల చేస్తాం.. 30 లక్షల బోగస్ ఓట్లను తొలగించాం: హైకోర్టులో ఈసీ

  • టెక్నాలజీ సాయంతో బోగస్ ఓట్లను తొలగించాం
  • ఈ నెల 12న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తాం
  • తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన హైకోర్టు

టెక్నాలజీ సాయంతో తెలంగాణలో 30 లక్షల బోగస్ ఓట్లను తొలగించామని హైకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్న పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

విచారణ సందర్భంగా బోగస్ ఓట్లు అన్నింటినీ తొలగించామని ఈసీ చెప్పింది. ఈ నెల 12న ఓటర్ల తుది జాబితాతో పాటు నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని తెలిపింది. ఓటర్ల జాబితాలో ఫిర్యాదులపై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలను వినిపించారు. 

More Telugu News