Vastv foundation: భార్యలు బతికి ఉండగానే 100 మందికి పిండ ప్రదానం.. వాస్తవ్ ఫౌండేషన్ నిర్వాకం!

  • భార్య బాధితులకు అండగా వాస్తవ్ ఫౌండేషన్
  • గోదావరిలో భార్యలకు పిండ ప్రదానం చేసిన భర్తలు
  • వేద మంత్రోచ్చారణ మధ్య కార్యక్రమం

భార్యలు బతికి ఉండగానే భర్తలు పిండ ప్రదానం చేసిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో సంచలనమైంది. వాస్తవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందమంది భర్తలు వేదమంత్రోచ్చారణ మధ్య గోదావరిలో తర్పణాలు విడిచారు. భర్తలకు భార్యలు విముక్తి కల్పిస్తారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వాస్తవ్ ఫౌండేషన్ అధ్యక్షుడు అమిత్ దేశ్‌పాండే తెలిపారు.

పెళ్లయిన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్నాయని, చివరికి అవి విడాకులకు దారి తీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వ్యవహారాల్లో మహిళలకే ఎక్కువగా మద్దతు లభిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో భర్తలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే వాస్తవ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసినట్టు అమిత్ తెలిపారు. గతంలో వారణాసిలోనూ పిండ ప్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు అమిత్ వివరించారు.

More Telugu News