Rajamouli: స్పీడందుకున్న మల్టీస్టారర్ పనులు.. వర్క్‌షాప్‌కు తారక్, చెర్రీ!

  • వర్క్‌షాప్‌కు హాజరవుతున్న చెర్రీ, తారక్
  • రాజమౌళితోపాటు సాంకేతిక బృందం
  • డిసెంబర్‌లో ప్రారంభం కానున్న షూటింగ్

రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ చడీచప్పుడు లేకుండా ఉన్న ఈ మల్టీస్టారర్ ప్రస్తుతం స్పీడందుకుంది. దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇక ఈ సినిమాలో కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్ అవడంతో అంచనాలకు రెక్కలొచ్చేశాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా నుంచి దర్శకధీరుడు.. తారక్‌, చెర్రీలకు పిలుపిచ్చాడని తెలుస్తోంది.

ఈ మేరకు స్టార్ హీరోలిద్దరూ ప్రత్యేక వర్క్‌షాప్‌కు హాజరవుతున్నట్టు సమాచారం. ఈ వర్క్‌షాప్‌లో రాజమౌళితోపాటు మిగిలిన సాంకేతిక బృందం కూడా పాల్గొనబోతోందని తెలుస్తోంది. బాక్సింగ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో తారక్, చెర్రీ లిద్దరూ అన్నదమ్ములుగా నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. 2020లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం.

More Telugu News