lovers: ప్రేమికుల బలవన్మరణం.. వేర్వేరు ఘటనలలో ఇద్దరి మృతి!

  • ఒకే రోజు వేర్వేరు చోట్ల తనువు చాలించిన ఇద్దరు
  • ప్రేమకు ఖరీదు కట్టారని ఒకరు, ఇంట్లో వారు మందలించారని మరొకరు
  • రెండు కుటుంబాలకు తీరని శోకం

పెళ్లి చేసుకుని అందమైన జీవితాన్ని సొంతం చేసుకోవాలని ఊహించుకున్న రెండు ప్రేమ జంటల కలల్ని ఇంటి పెద్దలు చెరిపేశారు. తన ప్రేమకు విలువ కట్టారని ఒక యువతి ప్రాణం తీసుకోగా,  ఆమె లేనిదే తనకీ లోకం అక్కర్లేదని మరో యువకుడు బవంతంగా తనువు చాలించాడు. వేర్వేరు చోట్ల జరిగిన ఈ రెండు ఘటనలు రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి.

పోలీసుల కథనం మేరకు... మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ ఠాణా పరిధి చిన్నరేవల్లి గ్రామానికి చెందిన కుర్వ శ్రీలత (18), శేఖర్‌ ముదిరాజ్‌ ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. వారి పెళ్లికి పెద్దలు ససేమిరా అనడంతో పది రోజు క్రితం ఇల్లు వదిలి పారిపోయారు. రెండు కుటుంబాల్లో కలకలానికి కారణమైన ఈ ఘటనపై చిననరేవల్లి గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. వారి ప్రేమ, పెళ్లి వ్యవహారం మొత్తానికి అసలు కారకుడు శేఖర్‌ అని తీర్మానించి జరిమానా విధించారు. అతని కుటుంబం శ్రీలత కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు.

పంచాయతీ పెద్దల తీర్పుతో శ్రీలత తీవ్రమనోవేదనకు గురైంది. తమ స్వచ్ఛమైన ప్రేమను అంగీకరించలేని పెద్దల ‘నడుమ’ బతికే కంటే చావే నయమని భావించిన శ్రీలత గత నెల 30వ తేదీన పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది.  

కాగా, ఇదే జిల్లాలోని భూత్పూర్‌ మండం కొత్తమొల్గర కొత్త తండాకు చెందిన రాజు అనే 19 ఏళ్ల యువకుడు తన ప్రేమ విషయం తెలిసి తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై తనువు చాలించాడు. క్రషర్‌ కంపెనీలో ప్లాంట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజు కొన్నాళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. రోజూ రాత్రివేళలో ఆమెతో మాట్లాడుతుండేవాడు. దీన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు శుక్రవారం తీవ్రంగా మందలించారు.

దీంతో ఆవేదనకు గురైన ఆ యువకుడు తన గదిలోనే బ్లేడుతో చెయ్యి కోసుకుని రక్తంతో గోడపై ప్రియురాలి పేరు రాశాడు. అనంతరం దాన్ని వీడియోతీసి వాట్సాప్‌ ద్వారా స్నేహితులకు పంపి తాను చనిపోతున్నట్లు తెలిపాడు. ఆ అమ్మాయి కోసమే చనిపోతున్నానని, ఆమెతోనే తన చితికి నిప్పంటించాలని సందేశం పంపాడు. అనంతరం ఎంతకీ ప్రాణం పోకపోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్పాడ్డాడు.  

More Telugu News