akhil: విడుదల తేదీ విషయంలో ఇబ్బందుల్లో పడిన 'మిస్టర్ మజ్ను'

  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను'
  • రిపబ్లిక్ డేకి రిలీజ్ చేసే ఆలోచన 
  • అప్పుడే రంగంలోకి 'ఎన్టీఆర్ మహానాయకుడు'

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా 'మిస్టర్ మజ్ను' చిత్రం రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, చాలావరకూ విదేశాల్లోనే షూటింగు జరుపుకుంది. గతంలో అఖిల్ చేసిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఈ సారి పోటీ లేకుండా సోలోగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని నాగార్జున భావించారు. అందులో భాగంగానే ఈ సినిమాను సంక్రాంతికి కాకుండా, రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

 అయితే ఇప్పుడు 'ఎన్టీఆర్ మహానాయకుడు' కారణంగా అఖిల్ మూవీ ఇబ్బందుల్లో పడింది. 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాను జనవరి 9వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్న ఈ సినిమా టీమ్, తరువాత భాగాన్ని 'ఎన్టీఆర్ మహానాయకుడు' పేరుతో జనవరి 24వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పింది. ఎన్టీఆర్ బయోపిక్ కి గల క్రేజ్ గురించి తెలియడం వలన ఆలోచనలోపడిన 'మిస్టర్ మజ్ను' టీమ్, ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.   

More Telugu News