Rajamouli: రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'పై ఆసక్తికర అప్ డేట్!

  • ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలసి భారీ మల్టీ స్టారర్
  • స్వాతంత్ర్య ఉద్యమం నాటి కథ అంటూ ప్రచారం
  • తయారవుతున్న సెట్స్, ప్రాపర్టీస్

రాజమౌళి 'బాహుబలి' రెండు భాగాల తరువాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలసి భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగే ఈ సినిమాపై ఇప్పుడు టాలీవుడ్ లో ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

ఇది స్వాతంత్ర్య ఉద్యమం నాటి కథ అని చెప్పుకుంటున్నారు. అందుకు సంబంధించిన సెట్స్, ఆ కాలంలో వాడాల్సిన ప్రాపర్టీస్ తదితరాలను ప్రస్తుతం రాజమౌళి టీమ్ దగ్గరుండి తయారు చేయిస్తోందట. డిసెంబర్ నుంచి జరిగే షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొంటాడని, రామ్ చరణ్ కొన్ని రోజుల తరువాత జాయిన్ అవుతాడని తెలుస్తోంది.

More Telugu News