nagachaitanya: 'సవ్యసాచి ' నుంచి ఫస్టు సింగిల్ వచ్చేస్తోంది

  • చైతూ జోడీగా నిధి అగర్వాల్ 
  • ఈ నెల 9న రానున్న ఫస్టు సింగిల్
  • కీలకమైన పాత్రలో భూమిక

'ప్రేమమ్'తో హిట్ ఇచ్చిన కారణంగా చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ 'సవ్యసాచి' చేస్తున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఈ నెల 9వ తేదీన ఫస్టు సింగిల్ ను వదలనున్నారు. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. మాధవన్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో, భూమిక ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ ను తెచ్చిపెడుతుందనే నమ్మకంతో చైతూ వున్నాడు.  

More Telugu News