Telangana: తెలంగాణ ఓటర్ల జాబితా సవరణ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా

  • మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్
  • దీనిపై విచారణ 8వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు
  • 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్న ఈసీ  

తెలంగాణ ఓటర్ల జాబితా సవరణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ పై విచారణ 8వ తేదీకి వాయిదా పడింది. విచారణ పూర్తయ్యే వరకు తుది ఓటర్ల జాబితా ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 8న ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఈ జాబితాను తమకు అందించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఓటర్ల జాబితా అవకతవకలపై మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో రెండు పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు, మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను మాత్రమే విచారించింది.

More Telugu News