Nizamabad District: బతుకమ్మ వేడుకలు ‘తెలంగాణ జాగృతి’ తరపున నిర్వహించట్లేదు: కవిత

  • ఈ ఏడాది ఎన్నికల ఏడాది
  • అందుకే, బతుకమ్మ వేడుకలు నిర్వహించట్లేదు
  • విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదు

ప్రతి ఏడాది బతుకమ్మ వేడుకలను తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది బతుకమ్మ వేడుకలను ఆ సంస్థ తరపున నిర్వహించడం లేదు. ఈ విషయాన్ని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. ఈ ఏడాది ఎన్నికల ఏడాది కనుకనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని, భవిష్యత్ లోనూ తీసుకోమని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదని అన్నారు. ఈ ఏడాది బతుకమ్మ పండగను మహిళలు ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు.

More Telugu News