Chandrababu: ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు: సీఎం కేసీఆర్ ఫైర్

  • ప్రాజెక్టులకు అడ్డంపడ్డ దుర్మార్గుడు చంద్రబాబు
  • కాంగ్రెస్ ప్రచారానికి చంద్రబాబు కోట్ల రూపాయలిస్తాడట
  • అమరావతి గులాంలు, ఢిల్లీ గులాంలు కావాలా?
  • మన పాలన మనకే కావాలా?’

‘తెలంగాణ’ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర లేదని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నిజామాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాదసభలో ఆయన మాట్లాడుతూ, ‘‘తెలంగాణ’ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర లేదని ఆజాద్ అంటున్నాడు. టీఆర్ఎస్ పాత్ర లేకుంటే ఆజాద్ అయ్య పాత్ర ఉందా? గులాంలకు బుద్ధి చెప్పాలంటే నిజామాబాద్ లో 9 స్థానాలు గెలవాలి. ఈ దుర్మార్గులకు చంద్రబాబు నాయుడు ఐదు వందల కోట్లు, కాంగ్రెస్ ప్రచారానికి మూడు హెలికాఫ్టర్లు బుక్ చేసి చంద్రబాబు ఇస్తాడట.

వీళ్లు వాని కాళ్లొత్తి.. ఊరేగించి.. మళ్లీ తెస్తారట.. మన నెత్తిన పెడతారట..ఇదేనా తెలంగాణకు కావాల్సింది? మనం కోరుకున్నది ఇదేనా? పోరాటం చేసింది ఇందుకేనా? ఇంతమంది చచ్చిపోయింది ఇందుకేనా? ఏడు మండలాలు గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు. కరెంటు ఇవ్వకుండా రాక్షసానందం పొందిన రాక్షసుడు చంద్రబాబు. ప్రాజెక్టులకు అడ్డంపడ్డ దుర్మార్గుడు చంద్రబాబు.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు. ఆయనతో పొత్తు కడతారా? అమరావతి గులాంలు, ఢిల్లీ గులాంలు కావాలా? మన పాలన మనకే కావాలా?’ అని సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించారు.

More Telugu News