pranay: మారుతీరావును మిర్యాలగూడకు తీసుకొచ్చిన పోలీసులు.. సోదాలు!

  • డీఎస్పీ ఆధ్వర్యంలో ఇళ్లలో సోదాలు
  • పలు కీలక ఆధారాలు స్వాధీనం
  • సోదాల అనంతరం జిల్లా కేంద్రానికి తరలింపు

మిర్యాలగూడలో చోటుచేసుకున్న ప్రణయ్ పరువుహత్య కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణ కోసం కోర్టు అనుమతితో నిందితులను కస్టడీకి తీసుకున్నారు. ఈనెల 5వ తేదీ వరకు వీరిని విచారించనున్నారు. ఈ నేపథ్యంలో కేసులో ప్రధాన నిందితులైన మారుతీ రావు (అమృత తండ్రి), అతని సోదరుడు శ్రవణ్ కుమార్ లను పోలీస్ బందోబస్తు మధ్య మిర్యాలగూడకు తీసుకొచ్చారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇరువురి ఇళ్ల తాళాలు తెరిపించి, సోదాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆధారాలతో పాటు, కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సోదాలు ముగిసిన అనంతరం ఇద్దరినీ తిరిగి జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. 

More Telugu News