jagan: జగన్, పవన్, కన్నా, జీవీఎల్ లపై బుద్ధా వెంకన్న విమర్శలు

  • అక్రమాస్తులను కాపాడుకోవడానికే కన్నా బీజేపీలో చేరారు
  • జీవీఎల్ ఒక బఫూన్
  • జగన్, పవన్ లు పొలిటికల్ డిప్రెషన్ లో ఉన్నారు

తన అక్రమాస్తులను కాపాడుకోవడానికే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఓ జేబులో బీజేపీ జెండా, మరో జేబులో వైసీపీ జెండా పెట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. 2014లో తప్పించుకున్నప్పటికీ... 2019లో మాత్రం కన్నా జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు ఒక బఫూన్ అని అన్నారు. రాష్ట్రానికి పట్టిన శని జీవీఎల్ అని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు పొలిటికల్ డిప్రెషన్ లో ఉన్నారని... ఒకాయన ముద్దులు పెడుతుంటే, మరొకాయన స్టేజ్ మీద ఆవేశంతో ఊగిపోతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ చేస్తున్న వ్యాఖ్యలను విని జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News