anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • డబ్బింగ్ మొదలెట్టిన అనుపమ 
  • కర్ణాటకలో ఎన్టీఆర్ సినిమా బిజినెస్ క్రేజ్ 
  • ప్రస్తుతం హిందీ చిత్రాలే అంటున్న జాహ్నవి 

*  రామ్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న 'హలోగురూ ప్రేమకోసమే' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్నటి నుంచి కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకి డబ్బింగ్ చెబుతోంది.
*  కర్ణాటక ప్రాంతంలో కూడా ఎన్టీఆర్ కు విపరీతమైన క్రేజ్ వుంది. ఇందుకు నిదర్శనంగా ఆయన తాజా చిత్రం 'అరవింద సమేత' బిజినెస్ ను చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి సంబంధించి అక్కడి రాయచూర్ టెర్రిటరీ ప్రదర్శన హక్కులు కోటి రూపాయలకు అమ్ముడుపోయి రికార్డ్ సృష్టించాయి.
*  ప్రస్తుతం దక్షిణాది భాషా చిత్రాలలో నటించే ఆలోచన తనకు లేదని చెప్పింది నాటి అందాలతార శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందే ఓ తెలుగు చిత్రంలో జాహ్నవి కథానాయికగా నటించనుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె అలా స్పష్టం చేసింది. ప్రస్తుతం హిందీ చిత్రాలలోనే నటిస్తానని చెప్పింది.

More Telugu News