Manikarnika: గాంధీ జయంతి నాడు విడుదలైన 'మణికర్ణిక' టీజర్!

  • కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో 'మణికర్ణిక'
  • అలరిస్తున్న టీజర్
  • చివరి షెడ్యూల్ కు కంగనా దర్శకత్వం

జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' చిత్రం ట్రయిలర్ గాంధీ జయంతి సందర్భంగా ఈ ఉదయం విడుదలైంది. "తన దేశం కోసం ఎన్నో యుద్ధాలు చేసింది" అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వినిపిస్తూ ప్రారంభమయ్యే ఈ టీజర్ ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తోంది. బ్రిటిషర్ల జాతీయ జెండాను తన ఖడ్గంతో రాణి ఝాన్సీ లక్ష్మీ బాయి చీలుస్తున్న దృశ్యం హైలైట్ గా నిలుస్తోంది.

"ఇతిహాసాన్ని మార్చిన ఓ రాణి కథ. ఆమె ఇచ్చిన ఝలక్‌ చూడండి" అంటూ కంగనా, ఈ టీజర్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. కొన్ని కారణాల వల్ల క్రిష్, ఈ సినిమా చివరి షెడ్యూల్ కు దర్శకత్వం వహించలేకపోవడంతో ఆ బాధ్యతను కంగనా తన భుజాలపై వేసుకుంది. కంగనా రనౌత్ తో పాటు జిషుసేన్‌ గుప్తా, సురేశ్‌ ఒబెరాయ్‌, అతుల్‌ కులకర్ణి, డ్యానీ, అంకితా లోఖాండే తదితరులు నటించిన ఈ చిత్రం వచ్చే జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కానుంది. సినిమా టీజర్ ను మీరూ చూడండి.

More Telugu News