ap: కోడెలకు అస్వస్థత.. కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకుని వెళ్లిపోయిన వైనం!

  • గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి నివాళి అర్పించిన కోడెల
  • అనంతరం శ్మశానవాటికలను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్
  • మధ్యలో అస్వస్థతకు గురైన వైనం

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ ఉదయం నరసరావుపేటలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన నివాళి అర్పించారు. అనంతరం శ్మశానవాటికలను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ శ్మశానవాటికలో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించుకుని, ఇంటికి వెళ్లిపోయారు. అస్వస్థతకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News