sanjosh: ఆది! నువ్వు పుట్టకముందే పంచ్ లు వేసినవాడిని!: రాజేంద్రప్రసాద్

  • ప్రేమకథా చిత్రంగా 'బేవర్స్' 
  • సంజోష్ జోడీగా హర్షిత 
  • కీలకమైన పాత్రలో రాజేంద్ర ప్రసాద్

సంజోష్ .. హర్షిత జంటగా రమేశ్ చెప్పల దర్శకత్వంలో 'బేవర్స్' సినిమా రూపొందింది. ఈ సినిమా పేరు వినగానే ఇటీవల ట్రైలర్లో 'తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు .. మా ఎదవ ముదిరి బేవర్స్ అయ్యాడు' అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పిన డైలాగ్ గుర్తుకు వస్తుంది. చందు .. అరవింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హీరో తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ కీలకమైన పాత్రను పోషించారు.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై రాజేంద్రప్రసాద్ సరదాగా మాట్లాడుతూ అందరినీ నవ్వించారు. వేదికపై హీరో పక్కనే నుంచున్న హీరోయిన్స్ ను పిలిచి తన పక్కన కూడా నుంచోవచ్చంటూ వాళ్లను ఆటపట్టించారు. వేదికపై వున్న ఆదిని ఉద్దేశించి .. కుళ్లుకోవద్దని అన్నారు. అందుకు ఆది ఏదో చెప్పబోతుంటే రాజేంద్రప్రసాద్ ఖండించారు. 'నీ కంటే ముందు నుంచి పంచ్ లు వేసినవాడినిరా బాబూ నేను' అన్నారు. ఆది అనేవాడు పుట్టక ముందు నుంచి అల్లరి చేస్తున్నవాడు రాజేంద్ర ప్రసాద్' అంటూ నవ్వేశారు.    

More Telugu News