trisha: 'పేట' షూటింగులో జాయిన్ అయిన త్రిష

  • రజనీకాంత్ హీరోగా 'పేట'
  • ఒక హీరోయిన్ గా సిమ్రాన్ 
  • సంక్రాంతికి విడుదల  

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా 'పేట' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సిమ్రాన్ .. మరో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారు. రజనీ .. సిమ్రాన్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తూ వస్తున్నారు. తాజాగా 'వారణాసి'లో జరుగుతోన్న ఈ సినిమా షూటింగులో త్రిష కూడా జాయిన్ అయింది. రజనీ .. త్రిష కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, అనిరుథ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయనున్నారు. రజనీతో నటించే ఛాన్స్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్టుగా త్రిష చెబుతూ వచ్చింది. ఈ సినిమాతో ఆమెకి ఆ అవకాశం లభించింది. దాంతో త్రిష చాలా హ్యాపీగా ఫీలవుతోంది. ఈ సినిమా హిట్ అయితే తనకి అంతకి మించిన ఆనందం మరొకటి లేదంటూ సన్నిహితులతో చెబుతోందట.  

More Telugu News