Araku: మావోయిస్టులు భూస్థాపితమయ్యే సమయమిదే: మన్యం గిరిజనుల పేరిట పోస్టర్లు

  • మావోలపై పోస్టర్లలో తీవ్ర ఆగ్రహం
  • అరకు, పాడేరు కూడళ్లలో పోస్టర్లు
  • మావోలను తరిమేస్తామని హెచ్చరిక

గిరిజన నేతలైన కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల హత్యలకు వ్యతిరేకంగా అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో పలు పోస్టర్లు వెలశాయి. మావోయిస్టులు భూస్థాపితం అయ్యే రోజులు వచ్చాయని, తమ తరంలో హీరోలైన కిడారి, సోమల హత్యను ఖండిస్తున్నామని ఈ పోస్టర్లలో గిరిజనుల పేరిట పేర్కొన్నారు.

గిరిజన ద్రోహులుగా తయారైన మావోలను తరిమి కొడతామని తెలుపుతూ, 'మన్యం గిరిజనుల' పేరిట వెలిసిన ఈ మావోయిస్టుల వ్యతిరేక పోస్టర్లు ఇప్పుడు పలు కూడళ్లలో దర్శనమిస్తున్నాయి. ప్రజలను చంపే కర్కశత్వం కలిగున్న మావోయిస్టులను తరిమేస్తామని హెచ్చరించారు. ఇవి ఎవరు ప్రింట్ చేయించారన్న విషయమై సమాచారం లేకపోయినా, ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు వీటి గురించే చర్చించుకుంటున్నారు.

More Telugu News