YSRCP: 274వ రోజుకు చేరిన వైఎస్ జగన్ పాదయాత్ర!

  • గజపతినగరం నియోజకవర్గంలో పాదయాత్ర
  • కోరుకొండ సమీపంలో మధ్యాహ్న భోజన విరామం
  • రాత్రికి జొన్నవలసలో మకాం

గత సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్ర నేడు 274వ రోజుకు చేరింది. నేడు విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గంలో కొనసాగనుంది. ఇప్పటివరకూ 11 జిల్లాల్లో పర్యటించిన జగన్, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, మిగతా రెండు జిల్లాల యాత్రనూ పూర్తి చేసే దిశగా సాగుతున్నారు.

నేడు బలరాంపురం, కుమరాన్, కోరుకొండ మీదుగా ఆయన యాత్ర సాగనుందని వైకాపా ఓ ప్రకటనలో వెల్లడించింది. కోరుకొండ సమీపంలో మధ్యాహ్న భోజన విరామం అనంతరం, చిన్నాపురం జంక్షన్, కొరాడపేట, జొన్నవలస క్రాస్ మీదుగా జగన్ నడవనున్నారని, జొన్నవలస సమీపంలో రాత్రికి బస చేస్తారని తెలిపింది.

More Telugu News